మైలవరం: బైకు దొంగతనం కేసులో అదుపులో అనుమానితుడు.. విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు
Mylavaram, NTR | Sep 4, 2025 ఇబ్రహీంపట్నం శక్తి నగర్ లో ఓ బైకు చోరీకి గురైంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై గతంలో కూడా గంజాయి కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం జరిగిన ఈ దొంగతనంలో అతడికి మరో నలుగురు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.