శాంతిపురం మండలంలోని నడింపల్లిలో భువనేశ్వరి మహిళలతో కలిసి కోలాటం ఆడారు. జైజై చంద్రన్న.. జై జై పాటకు మహిళలతో కలిసి ఉత్సాహంగా కోలాటం ఆడారు. ఈ సందర్భంగా గ్రామంలోని గంగమ్మను దర్శించుకున్నారు. కొంతమంది మహిళలతో తమిళంలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. అనంతరం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.