మహబూబ్ నగర్ అర్బన్: అర్హులైన 523 సర్వే నంబర్ ప్రభుత్వ పట్టాలు ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి: సిపిఐ నాయకులు రామ్మోహన్
అర్హులైన 523 సర్వే నంబర్ ప్రభుత్వ పట్టాలు ఉన్న లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేసి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని సిపిఐ నాయకులు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద 523 సర్వే నెంబర్ బాధితులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది పేద ప్రజలు ఇంకా కిరాయి ఇండ్లలో ఉంటున్నారని వారికి న్యాయం చేయాలన్నారు.