ఆసిఫాబాద్ మండలం అడ దాస్నాపూర్ గ్రామంలో విజేష్ కిరాణా దుకాణంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ASF సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం మేరకు.. షాపు యజమాని రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం ఎడమ వైపు గోడను పగల గొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. రూ.8 వేలు నగదు,40వేలు సామాగ్రి చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.