కనిగిరి: ప్రజలు మూఢనమ్మకాలను వెడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగేశ్వరరావు
పామూరు పట్టణంలో జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు మూఢనమ్మకాలను వేడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. ప్రజల్లో నిరంతరం చైతన్యం తీసుకువచ్చేందుకు జనవిజ్ఞాన వేదిక కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల స్థాయిలో విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు షేక్ గయాజ్ భాష, జిల్లా జనవిజ్ఞాన వేదిక నాయకులు పాల్గొన్నారు