నంద్యాల జిల్లా చాగలమర్రి లోని పెద్ద మకాణం వీధికి చెందిన షేక్ దస్తగిరి శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సురేష్ తెలిపారు, దస్తగిరి ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ జీవిస్తుండేవాడని, అతనికి రెండేళ్ల క్రితమే వివాహమైందని పేర్కొన్నారు, దస్తగిరికి ఒక కూతురు ఉందన్నారు, కొంతకాలంగా తరచూ భార్యతో గొడవ పడుతూ మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు