రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ గణేష్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం, చిప్పలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్ముతున్నా ఓ వ్యక్తిని పట్టుకొని అతని వద్దనుండి 7520 రూపాయల విలువగల మద్యం బాటిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మండలంలో ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు.