విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియని ఒక రోజుతో పూర్తిగా తెలుసుకోలేమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ASF జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా ఇన్చార్జి డిఈఓ దీపక్ తివారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్ స్పైర్ మనాక్ కు చైర్మన్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక రోజుతో అర్థమయ్యేది కాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో అపజయం అనేది వస్తుందని దాని నుండి పాఠాలు నేర్చుకుని చేసిన తప్పులను సరిదిద్దుకొని విజయం