ఆసిఫాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ ఏరియాల్లో పిల్లలచే భిక్షాటన చేయించడం నేరం అని ఆసిఫాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్ అన్నారు. ఇటీవల కాగజ్నగర్ రైల్వే స్టేషన్, ఆసిఫాబాద్ బస్టాండ్ ఏరియాలో భిక్షాటన చేస్తున్న మైనర్ పిల్లలను బాల సంరక్షణ సదన్ కు తరలించినట్లు ఆదివారం మధ్యాహ్నం ఆయన తెలిపారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, పనికి లేదా భిక్షాటనకు పంపిస్తే తల్లిదండ్రులు, సంరక్షకులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.