జహీరాబాద్: ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం లోని జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్ మండలంతో పాటు ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలంలో ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా నిలిపివేనున్నట్లు అధికారులు తెలిపారు. బూస రెడ్డి పల్లి లోని పంప్ హౌస్ వద్ద అత్యవసర మోటర్ మరమ్మత్తుల నేపథ్యంలో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.