అద్దంకి నియోజకవర్గం లో 120 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం క్యాంప్ కార్యాలయం నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిలో 400 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదవాడి ఆరోగ్యానికి బాసటగా నిలుస్తుందని మంత్రి చెప్పారు.