మేడ్చల్: కమలా నగర్ లో శబరిమల దర్శనం కోసం ప్రత్యేక సైకిల్ యాత్ర
కమలానగర్ అయ్యప్ప స్వామి దేవాలయం పరిసరాల్లో భక్తి సందడి నెలకొంది. శబరిమల దర్శనం కోసం ప్రత్యేక సైకిల్ యాత్రను భక్తులు ఘనంగా ప్రారంభించారు. వెల్డింగ్ శీను గురుస్వామి ఆధ్వర్యంలో అంజయ్య గౌడ్ స్వామి, వీరనారాయణరెడ్డి స్వామి, రామాంజనేయులు స్వామి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. స్వామి నామస్మరణతో, భజనలతో, శబరిమల మహిమాన్విత దర్శనం కోసం ఈ ప్రయాణం ఈ యాత్ర కమల నగర్ నుంచి మొదలైంది.