రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలంలో గుడుంబా స్థావరాలు పై ఎక్సైజ్ పోలీసుల దాడులు. వీర్నపల్లి మండలంలోని గుడుంబా స్థావరాలపై ఎల్లరెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మద్దిమల్ల, లొద్దితండ, గోల్యా నాయక్ తండ, బావ్ సింగ్ తండా, బంజర తం,డా భూక్య తండా, రాసి గుట్ట తండాలో గుడుంబా స్థావరాలు పై దాడులు చేపట్టారు. ఈ దాడులలో సుమారు 20 లీటర్ల నాటు సారా సాధనం చేసుకుని 250 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.