రెబ్బెన మండలం తక్కలపల్లిలో వయోభారం,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల సంగెం మల్లక్క అనే వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు.ఆమె కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.