అద్దంకిలోని ఎమ్మార్వో కార్యాలయం నందు శుక్రవారం తమ డిమాండ్ల పరిష్కరించాలంటూ వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ తమకు పే స్కేల్ అమలు చేయాలని అన్నారు. అలాగే కారుణ్య నియామకాలు చేపట్టి అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని వారి డిమాండ్ చేశారు. గత సంవత్సరాలుగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.