ములుగు: తన భార్యను తీసుకెళ్లేందుకు వచ్చి చిన్నబోయినపల్లిలో లారీ ఢీకొని, భాస్కర్ అనే వృద్దుడు మృతి
Mulug, Mulugu | Jul 5, 2025 తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడానికి వచ్చి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డ ఘటన ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. శివాపురంకు చెందిన భాస్కర్ అనే వృద్ధుడు ఊరి నుంచి వస్తున్న తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి చిన్నబోయినపల్లికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన లారీ అతడిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని వెంబడించి గ్రామస్తులు స్టేషన్కు తరలించారు.