వాహనాల నెంబర్ ప్లేట్లు మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీలోగా HSRP తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేదంటే రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిమానాలు విధిస్తారని ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వాహనాలకు నెంబర్ ప్లేట్లు మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు. సోషల్