అద్దంకి మండలంలో ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నట్లు ఏవో వెంకట కృష్ణ ఆదివారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. పంట సాగు చేసిన రైతులందరూ తప్పనిసరిగా ఈ పంటలో నమోదు కావాలన్నారు. మండలంలో యూరియా కొరత లేదని రైతులు అపోహలు పడవద్దని ఏవో వెంకటకృష్ణ తెలియజేశారు. మరో 200 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు.