ప్రపంచ కప్ మహిళా క్రికెట్ విజేత భారత దేశ యువతుల ఆట స్ఫూర్తిదాయకం అని పులివెందుల పట్టణ ఎస్ ఐ సుభహాన్ పేర్కొన్నారు.స్నేహిత అమృత హస్తం సేవాసమితి మరియు కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల చే నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ని ఎస్ ఐ సుభహాన్,ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ బాలనారాయణ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సభ్యులు కృష్ణారెడ్డి, జన విజ్ఞాన వేదిక సభ్యులు సనావుల్లా,సేవాసమితి అధ్యక్షులు రాజు లు ప్రారంభించారు.