పలమనేరు: గంగవరం: మొరవపోయిన దండపల్లి చెరువు, హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు అధికారులకు సూచనలు చేసిన రైతులు
గంగవరం: తాళ్లపల్లి రైతు గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాల తర్వాత గండపల్లి చెరువు మొరవ పోతోంది. ఇక్కడి ప్రజలు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ నీటిని వృధాగా పోనీకుండా ఒడిసిపట్టి చెరువులను నింపేందుకు కృషి చేయాల్సిందిగా అధికారులకు నాయకులకు సూచనలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హంద్రీనీవా కాలువ నీటిని ప్రజలకు అనుకూలంగా మారుస్తున్నారు. ఈ నీటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు.