డిసెంబర్ 13 (శనివారం)న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు తప్పక వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు.జిల్లా కోర్టు పరిధిలోని న్యాయ సేవా సదన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ మార్గదర్శకాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 27 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలో 7, మిగిలిన బెంచ్లు జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు.