శ్రీకాళహస్తిలో 9 మంది స్మగ్లర్లు అరెస్ట్ శ్రీకాళహస్తి అటవీ పరిధిలో బుధవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 20 ఎర్రచందనం దుంగలు, 9 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఏఆర్ఎస్ఎస్ఐ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. అరెస్టైన వారిలో తిరుపతి జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.