పెదచెర్లోపల్లి: దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్ద చెర్లోపల్లి ఎస్ఐ నరసింహారావు
India | May 11, 2026
పెద్ద చెర్లోపల్లి మండలంలోని బందపాలెంలో ఎస్ఐ నరసింహారావు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఆయన సమావేశమయ్యారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవులకు ఊర్లకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. దొంగతనాల నివారణకు గ్రామస్తులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై కూడా ఎస్సై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.