అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని గోటుకూరు - లెప్రసీ కాలనీ మధ్య అనంతపురం - బళ్లారి ప్రధాని రహదారి పక్కన అనుమానాస్పద మృతి చెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడం జరిగిందని కూడేరు మండల ఏఎస్ఐ రామానాయుడు శుక్రవారం పేర్కొన్నారు. మృతుని వద్ద ఏ ఆధారాలు లేకపోవడంతో హత్య లేక ప్రమాదం విషయం పై స్థానిక లెప్రసీ కాలనీ మరియు బైరాకు వృద్ధాశ్రమం లోని వ్యక్తులకు కూడా సమాచారాన్ని పంపి ఆరా తీసారు. పూర్తి విచారణకు మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు కూడేరు ఏ ఎస్ ఐ రామానాయుడు పేర్కొన్నారు.