శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో జరుగుతున్న SIR ఎన్యుమరేషన్ ను పరిశీలించిన RDO వెంకట శివుడు మరియు రెవిన్యూ అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో SIR-2026 H2H (House-to-House) ప్రక్రియ 2026 జూన్ 15 నుండి జూలై 14 వరకు నిర్వహించబడుతోంది.ఈ సందర్భంగా ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ మరియు డిజిటలైజేషన్ ప్రక్రియలను రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటశివుడు మరియు తహసీల్దార్, ఆత్మకూరు పరిశీలించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 1,97,947 ఎన్యుమరేషన్ ఫారాలు (Enumeration Forms) పంపిణీ చేయవలసి ఉండగా, ఇప్పటివరకు 1,30,933 ఫారాలు పంపిణీ చేయబడినవి. అలాగే 3,829 ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేయబడినవి. అధికారులు ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు.