ప్రమాదకరమైన చైనా మాంజా వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు సోమవారం కఠిన చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచి హైదరాబాద్లోని ధూల్పేట ప్రాంతంలో గల్లీ గల్లీకి వెళ్లి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా చైనా మాంజాను నిల్వ చేయడం, విక్రయించడం వంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. చైనా మాంజాను విక్రయించే వారితో పాటు కొనుగోలు చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు