అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ వద్ద జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో గురువారం 1150 నిమిషాల సమయంలో ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పోలీస్ శాఖ అధికారులతో సైబర్ క్రైమ్ అంశం పైన అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పోలీసులతో సైబర్ క్రైమ్ అనే అంశం పైన అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగిందని దీని ద్వారా ప్రజల్లో సైబర్ క్రైమ్ ను అరికట్టేందుకు అవగాహన సదస్సులు విద్యార్థినిలకు సైబర్ క్రైమ్ ఏ విధంగా అడ్డుకోవాలా విద్యార్థినిలకు ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తామని జెఎన్టియు విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శన్ రావు పేర్కొన్నారు.