శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో జీవించేలా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని MLA స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.