శ్రీశైలం: బండి ఆత్మకూరులో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన. పాల్గొన్న మాజి MLA శిల్ప
బండి ఆత్మకూరులో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బండి ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మోటార్ బైక్లను తాళ్లతో లాక్కొంటూ వినూత్నంగా ఆందోళన చేపట్టి తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. పెంచిన ఇంధన ధరల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏడాదికి రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.