కోడుమూరులో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం రైతులు ధర్నా నిర్వహించారు. అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోలుకు సీసీఐ పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీసీఐ ద్వారా కింటా రూ. 12 వేలకు కొనుగోలు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.