సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు సోమవారం రూ .28,68,469లు విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల ఆరోగ్య పరిరక్షణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్పొరేట్ వైద్యశాలలో అప్పుచేసి వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులను విడుదల చేస్తూ పేదలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారన్నారు.