విద్యార్థులు యువకులు చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా పిలుపునిచ్చారు, హలో యువత మేలుకో మత్తు పదార్థాల నుండి నిన్ను నువ్వు కాపాడుకో అనే నిదానంతో ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లని సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు పోలీస్ స్పందన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా హుస్సేన్ పీరా మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు పట్టుకునే మత్తు పదార్థాల రవాణా కేసులో అధిక శాతం యువకులే పట్టుబడుతున్నారని ఆయన పేర్కొన్నారు