కనిగిరి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేయడం దారుణమని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు. కడపలో వైసిపి నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నారాయణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత వైసిపి ప్రభుత్వం లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని దాదాపు పూర్తిచేసే దశకు తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులను నిలిపివేశారన్నారు.