సహకార ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను పరిశీలించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సహకార ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం నుండి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించారు అనంతరం జేఏసీ నాయకులు కాజాముద్దీన్ భాష గోపాల్ రెడ్డి రహంతుల్లా నాయకత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.