రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన హిందూపురం విద్యార్థి సన్నిధి
హిందూపురం పట్టణంలోని పాంచజన్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టి. సన్నిధి రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ, తమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని టి. సన్నిధి ఈ నెల 18వ తేదీన అనంతపురం లో జరిగిన జిల్లాస్థాయి అండర్ -19 షటిల్ బ్యాట్మింటన్ లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సన్నిధి త్వరలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. తమ పాఠశాల విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎం