కోడుమూరు పట్టణంలోని ఐదవ సచివాలయం ఎదుట సోమవారం పేద మహిళలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ తో పాటు రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. సచివాలయం ఉద్యోగికి అర్జీలు అందించారు.