చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి సామూహిక కుంకుమార్చనల కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి పట్టణంలోని మహిళలు శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చి స్వామివారికి, అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు చేసి, వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.