సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమిది గ్రామంలో సోమవారం 6:30 గంటల సమయంలో రామగిరి సర్కిల్ సిఐ శ్రీధర్ రామగిరి ఎస్సై ప్రదీప్ తదితరులు ఒంటిమిది గ్రామంలో దొంగతనానికి గురైన నివాసాన్ని పరిశీలించడం జరిగింది. స్థానిక ఎస్సై ప్రదీప్ సర్కిల్ సీఐ శ్రీధర్ తదితరులు కుంటిమిది ఓబులేసును కుటుంబ సభ్యులను విచారించి ఎంత బంగారం పోయింది ఎంత నగదు ఎత్తుకెళ్లాలని వివరాలను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున బెంగళూరుకు వెళ్లడం జరిగిందని అయితే ఇంట్లో ఉంచిన మూడు కేజీల వెండి ఆరు గ్రాముల బంగారం 75 వేల రూపాయలు నగదును దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందని ఒంటిమిది ఓబులేసు పేర్కొన్నారు.