ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం సమీకృత కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయా కార్యాలయాల రిజిస్టర్లు, రికార్డులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు పనిచేస్తాయని, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజలకు చేరువలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.