దోమ: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు వత్తిడి పక్కన పెట్టాలని సూచించిన ఎస్పీ కోటిరెడ్డి
Doma, Vikarabad | Mar 17, 2024 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుండి పరీక్షలు మొదలవుతున్నందున విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఎవరికైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలిగితే డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ అధికారులకు తెలపాలని పేర్కొన్నారు.