అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల ఎంఈఓ 1 పాటిల్ మల్లారెడ్డి,గుత్తి ఇంచార్జ్ డిప్యూటీ డీఈఓ గా పదవీ విరమణ పొంది నిబద్ధత కలిగిన ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శప్రాయుడు అని అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు పేర్కొన్నారు. శనివారం బెలుగుప్ప ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎంఈఓ 2 హరికృష్ణ అధ్యక్షతన జరిగిన డి వై ఓ మల్లారెడ్డి పదవీ విరమణ సన్మాన సభకు డీఈవో తో పాటు రిటైర్డ్ ఆర్డిఓ రామారావు, మండలాధికారులు ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ మండలాల ఎంఈఓ లు, ఏపీటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, యుటిఎఫ్ నాయకులు కలసి మల్లారెడ్డి సునంద దంపతులను ఘనంగా సన్మానించారు.