కోడుమూరు: పెంచికల పాడు వద్ద గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ, 30 పైగా గొర్రెలు మృతి, 20 గొర్రెలకు గాయాలు
గూడూరు మండలంలోని పెంచికలపాడు గ్రామ సమీపంలో శనివారం రాత్రి గొర్రెల మందపైకి లారీ దూసుకెల్లడంతో భారీగా నష్టం వాటిల్లింది. గొర్రెల కాపరులు మందను గ్రామం వైపు తీసుకెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో 30కి పైగా గొర్రెలు మృతి చెందగా, మరో 20 గొర్రెలు గాయాలపాలైనట్లు తెలిసింది. తీవ్రనష్టం వాటిల్లడంతో గొర్రెల కాపరులు లబోదిబోమన్నారు.