అమరావతి రాజధానిగా పార్లమెంటులో దివ్యమైన ముహూర్తంలో చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారు : ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
అమరావతి రాజధానిగా పార్లమెంటులో 11 గంటల 11 నిమిషాలకు దివ్యమైన ముహూర్తంలో చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఏపీకి అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలోఅనంతపురం నగరంలో భారీ స్థాయిలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద ఈ సంబరాలు జరిగాయి. బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి నగరవాసులకు అందజేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు.