సంతనూతలపాడు: గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు వాటిని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పెరుగు శ్రీనివాస్ ప్రసాద్ సూచించారు. సంతనూతలపాడు ఎస్సీ కాలనీ సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. గృహ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో పరిశీలించి, గృహ నిర్మాణాల సందర్భంగా లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక హౌసింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి త్వరగా నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు.