విద్యార్థులు లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలి: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డా.ఆళ్ల అప్పలస్వామి
విద్యార్థిని విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని, వాటి సాధనకు కృషి చేయాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. కఠోర శ్రమ, పట్టుదల, ఏకాగ్రతతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2025-26 అకడమిక్ ఇయర్లో నూతనంగా విచ్చేసిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులు బాగా చదవాలన్నారు.