మహానంది దేవస్థానంలో భక్తుడు పోగొట్టుకున్న సెల్ ఫోను తిరిగి అప్పజెప్పి నిజాయితీని చాటుకున్న హోంగార్డు శివరాం
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భక్తుడు చంద్రప్ప కుటుంబ సమేతంగా మహానంది ఆలయానికి వచ్చారు.బయటి కోనేరు వద్ద స్నానం చేసి దర్శనానికి వెళ్ళాడు ఈ క్రమంలో ఆయన తన మొబైల్ ఫోన్ మర్చిపోగా, అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివరాం రాయల్ దానిని గమనించారు. వెంటనే విచారణ చేపట్టి భక్తుడిని గుర్తించి ఫోన్ అందజేశారు. హోంగార్డు నిజాయితీని అభినందిస్తూ బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.