టిడిపి కార్యకర్తను పరామర్శించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి
Dhone, Nandyal | Nov 30, 2025 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లదిన్నెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. చంద్రశేఖర్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు.