కొండపి: కొండపి మండలం కే ఉప్పలపాడు లో పొగ క్యూరింగ్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు
కొండపి మండలం కే ఉప్పలపాడులో టంగుటూరు పొగాకు వేలం కేంద్రం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పొగాకు క్యూరింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. బోర్డు అనుమతి మేరకు మాత్రమే పండించాలని చెప్పారు. అధికంగా పొగాకు పండించి నష్టాలు తెచ్చుకోవద్దన్నారు. ఒక్కో బ్యారను అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే పంట సాగు చేయాలన్నారు. అనంతరం క్యూరింగ్ అయిన పొగాకును పరిశీలించారు.