కోడుమూరు పట్టణంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల సర్కిల్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి దివ్యాంగులు క్షీరాభిషేకం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి జేజేలు పలికారు. అనంతరం వెలుగు కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హాజరైన దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడారు. దివ్యాంగులను ప్రతి దశలోనూ ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.