దర్శి: ముండ్లమూరు మండలం పూరిమెట్లలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ్ పథకంపై అవగాహన
Darsi, Prakasam | Apr 16, 2025 ముండ్లమూరు మండలం పూరిమెట్లలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ యశోద మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. రక్తహీనత గల వారిని గుర్తించి గర్భిణీ నుంచి బాలింతల వరకు అవసరమైన పోషణ అంగన్వాడి ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.